కృష్ణా నది
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశం మరియు ఆంధ్ర ప్రదేశ్ లో రెండో పెద్ద నది అయిన కృష్ణా నది (Krishna river)ని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] ప్రయాణం
ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్గంగ లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలోఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు, భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్నగర్ జిల్లా తంగడి వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. తరువాత కర్నూలు కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:
- మహారాష్ట్ర: 26.8%
- కర్ణాటక: 43.8%
- ఆంధ్ర ప్రదేశ్: 29.4%
[మార్చు] కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు
కృష్ణా నదికి భారత దేశంలోన్ని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉన్నది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి:
- శ్రీశైలం: ప్రసిద్ధ శివక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, శ్రీశైలం.
- ఆలంపూర్ : ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు మొదలగు దేవాలయ సముదాయాలున్న ఆలంపూర్ చాళుక్య రాజుల ఆలయ శిల్ప నిర్మాణానికి అద్దం పడతాయి.
- శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం (కనకదుర్గ) - విజయవాడ
- అమరావతి: అమరారామం ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామి గా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామలకు కూడా ఇది ప్రసిద్ధి.
- మోపిదేవి: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు.
[మార్చు] ప్రాజెక్టులు
| కృష్ణా నదిపై ప్రాజెక్టులు |
| ప్రకాశం బారేజి |
| నాగార్జునసాగర్ |
| శ్రీశైలం |
| తెలుగుగంగ |
| ఎ.మాధవరెడ్డి ప్రాజెక్టు |
| శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ |
| పులిచింతల |
| ప్రియదర్శిని జూరాల |
| పోతిరెడ్డిపాడు |
| ట్రిబ్యునళ్ళు |
| బచావత్ ట్రిబ్యునల్ |
- ప్రధాన వ్యాసము: కృష్ణా నదీ వ్యవస్థలోని ప్రాజెక్టులు
కృష్ణా నది పరీవాహక రాష్ట్రాలు మూడూ కూడా విస్తృతంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి:
[మార్చు] కర్ణాటక
పై రెంటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని అంటారు.
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్
- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు : కృష్ణానది ఆమ్ధ్రప్రదేశ్లో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. మహబూబ్ నగర్ జిల్లా రావులపల్లి సమీపంలో నిర్మించారు.
- శ్రీశైలం ప్రాజెక్టు : కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. నల్గొండ జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టును 1956లో ప్రారంభించారు.
ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.
[మార్చు] బయటి లంకెలు
- ఎన్కార్టాలో కృష్ణానది పటము
- కృష్ణానది సంగమం - గూగుల్ నుండి
- కృష్ణానదిలో కాలుష్యం
- కృష్ణా డెల్టా - నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ వారి సైట్ నుండి
|
|
|---|
| సింధు · బ్రహ్మపుత్ర · గంగ · యమున · సరస్వతి · నర్మద · తపతి · మహానది · వంశధార · గోదావరి · కృష్ణ · తుంగభద్ర · కావేరి · పెన్న (పినాకిని) · సట్లెజ్ నది · చీనాబ్ నది] · జీలం నది · బియాస్ నది · రావి నది · కోసీ నది |
|
|
|---|
| గోదావరి · కృష్ణా · తుంగభద్ర · పెన్నా నది · కిన్నెరసాని · కుందేరు · గుండ్లకమ్మ · గోస్తని · చంపావతి · చిత్రావతి · చెయ్యేరు · తాండవ · తుల్యభాగ · నాగావళి · పాపాఘ్ని · పాలేరు · పెన్ గంగ · బుడమేరు · భీమా · మున్నేరు · మూసీ · వైరా · సగిలేరు · సువర్ణముఖి, చిత్తూరు · సువర్ణముఖి, నాగావళి · తాలిపేరు |
|
|
|
|---|---|
| నదులు | గోదావరి · కావేరి · కృష్ణ · మహానది · పలర్ · పొన్నయ్యర్ · శ్వేత నది · వశిష్ఠ నది · వెల్లర్ |
| పీఠభూములు | దక్కను పీఠభూమి · కోలార్ పీఠభూమి |
| కొండలు | బిలిగిరి కొండలు · చిట్టిరి కొండలు · కల్రాయణ్ కొండలు · కరాంతమలై · కొల్లి కొండలు · లంకమల్ల · మెట్టూరు కొండలు · నల్లమల్ల · పచ్చైమలై · పాలమలై · పాలికొండ · షెరవొయ్ · సిరుమలై · వడ చెన్నిమలై · వెలిగొండ శ్రేణి |
| జలపాతాలు | కిలియూర్ జలపాతం · పెరియార్ జలపాతం · పుదూరు మేఘన్ జలపాతం · మయిల్ ఉత్తు జలపాతం · మంగళం జలపాతం |
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · ఒరిస్సా · తమిళనాడు · పశ్చిమ బెంగాల్ |
|
|
|
|---|---|
| ఉపనదులు | తుంగభద్ర నది · భీమా నది · మూసీ నది · తుంగనది · భద్రనది · మలప్రభ నది · ఘటప్రభ నది |
| ప్రాజెక్టులు | అలమట్టి ప్రాజెక్టు · నారాయణపూర్ ప్రాజెక్టు · ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు · శ్రీశైలం ప్రాజెక్టు · నాగార్జునసాగర్ ప్రాజెక్టు |
| తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు | శ్రీశైలం · ఆలంపూర్ · అమరావతి · మోపిదేవి · శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం |