అల్లసాని పెద్దన
వికీపీడియా నుండి
| అల్లసాని పెద్దన | |
| జననం | 15, 16 శతాబ్దాల నడుమ బళ్ళారి మండలం, దోరాల (దోర్ణాల) గ్రామం |
|---|---|
| ఇతర పేర్లు | ఆంధ్ర కవితా పితామహుడు |
| రచనలు | స్వారోచిషమనుసంభవము లేదా మనుచరిత్ర |
| గురువు | శఠగోపయతి |
| ఆశ్రయమిచ్చిన రాజులు | శ్రీ కృష్ణదేవ రాయలు |
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రధమ ప్రబంధముగా ప్రసిద్దికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.
[మార్చు] రచనలు
- స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర)
- అలభ్య రచనలు
- హరికథాసారము
- రామస్తవరాజము
- అద్వైత సిద్ధాంతము
- చాటు పద్యాలు
[మార్చు] చూడండి
| అష్టదిగ్గజములు |
|---|
| అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |